ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వి రాజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 08:35 PM

హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర ప్రీరిలీజ్ వేడుక వైభవంగా జరుగుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ 30 ఇండస్ట్రీ పృథ్వి రాజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా చిరంజీవి గారి రుణం తీర్చుకోలేను అని పృథ్వి తెలిపాడు. ఈ జన్మ మొత్తానికి గుర్తుండిపోయే పాత్ర ఈ చిత్రంలో చేశాను. నా పాత్ర ఇంటర్వెల్ లో చాలా కీలకం. నరసింహ స్వామి మళ్ళీ పుట్టాడు దొరా అనే ఎమోషనల్ డైలాగ్ తనకు ఉందని పృథ్వి తెలిపాడు. సైరా రికార్డులు క్రియేట్ చేస్తుంది. నా పాత్రని బట్టే చెప్పొచ్చు ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతోందో అని పృథ్వి అన్నాడు. రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ మెగాస్టార్ కత్తితో నరికే సన్నివేశం ఉంది. అలా ఆయన రికార్డులని తెగనరకడానికి వస్తున్నారు. ఈ చిత్రంలో మేము ఎమోషనల్ గా సాగే ఫైట్స్ చేశాం అని రామ్ లక్ష్మణ్ తెలిపారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa