నందమురి బాలకృష్ణ యొక్క ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 'అఖండ 2: తాండవం' పై భారీ హైప్ ఉంది. ఈ చిత్రం పాన్ ఇండియన్ గా విడుదల కానుంది. ఈ యాక్షన్ డ్రామాలో సంయుక్త హీరోయిన్ గా ఆది పినిసెట్టి విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, బజ్రంగి భైజాన్ పాత్రకు ప్రసిద్ధి చెందిన హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 50 రోజులలో థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. రామ్ అచంటా మరియు గోపినాథ్ అచంటా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కింద అఖండ 2 ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa