ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోదారి ఒడ్డున రాశి ఖన్నాతో సాయి ధరం తేజ్ రొమాన్స్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 10:08 AM

సుప్రీం హీరో సాయి ధరం తేజ్ , రాశి ఖన్నా  హీరోహీరోయిన్లుగా  మారుతి దర్శకత్వం వహిస్తున్న  ప్ర‌తిరోజు పండ‌గే...  చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పురోగమిస్తోంది.   మెగా హీరో , రాశీ తో రొమాన్స్ చేస్తున్న స్టిల్స్ తాజాగా సామాజిక మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వ‌రుస ఫ్లాపుల‌ను ఎదుర్కొన్న సాయి ధరం తేజ్  ఈ మ‌ధ్య‌ చిత్రలహరితో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు.  ప్రస్తుతం ప్రతీరోజు పండ‌గేతో ఆవిజయ పరంపరను కొనసాగింస్తుద‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నాడాయ‌న‌.   గీతా ఆర్ట్స్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా బ్యాంక్రోల్ చేసిన ఈ చిత్రంలో సత్యరాజ్ సాయి ధరం తేజ్ తాతగా, రావు రమేష్ తన తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ప‌క్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గ్రామీణ క‌థాంశంతో రూపొందే ఈ చిత్రం  క్రిస్‌మస్ స్పెషల్‌గా డిసెంబర్‌లో తెరపైకి రానుందని చిత్ర‌వ‌ర్గాలు చెప్పాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa