చెన్నై కేంద్రంగా సంచలనం సృష్టించిన మత్తుపదార్థాల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ సినీనటులు శ్రీకాంత్, కృష్ణలకు సమన్లు జారీ చేసింది. విచారణకు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.ఈ ఏడాది జూన్ నెలలో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న ఆరోపణలపై ఘనా దేశానికి చెందిన జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి లభించిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టగా, ఈ కేసులో అన్నాడీఎంకే మాజీ నేత ప్రశాంత్, నటులు శ్రీకాంత్, కృష్ణ సహా పలువురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40 వేల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో పెద్ద ఎత్తున అక్రమ నగదు లావాదేవీలు జరిగి ఉండవచ్చని భావించిన ఈడీ ఆగస్టులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కేసులో శ్రీకాంత్, కృష్ణ బెయిల్పై బయట ఉండగా, ఇతర నిందితులు జైల్లోనే ఉన్నారు. ఇటీవల పుళల్ జైల్లో ఉన్న ప్రశాంత్, జవహర్, ప్రదీప్ కుమార్లను ప్రత్యేక కోర్టు అనుమతితో ఈడీ అధికారులు విచారించారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో, తాజాగా నటుడు శ్రీకాంత్ను ఈ నెల 28న, కృష్ణను 29న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సమన్లలో పేర్కొన్నారు. వీరి విచారణతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa