సూపర్స్టార్ రజనీకాంత్ తన స్నేహబంధం గురించి, తన అసలు పేరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ స్నేహితుల కోసం సమయం కేటాయిస్తానని, వారు తనను పాత పేరుతో పిలిచినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుందని తెలిపారు. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన వీడియో సందేశం ద్వారా మాట్లాడారు.TNAU 1975-79 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం వర్సిటీ క్యాంపస్లోని అన్నా ఆడిటోరియంలో జరిగింది. సుమారు 45 ఏళ్ల తర్వాత జరిగిన ఈ కార్యక్రమానికి వంద మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ హాజరు కాలేకపోయినా, ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ "నేను ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి బెంగళూరు వెళ్తాను. అక్కడ నాతో పాటు డ్రైవర్లుగా, కండక్టర్లుగా పనిచేసిన నా పాత స్నేహితులను కలుస్తాను. నా అసలు పేరు శివాజీని నేను దాదాపు మర్చిపోయాను. కానీ నా స్నేహితులు నన్ను ఆప్యాయంగా 'శివాజీ' అని పిలిచినప్పుడు కలిగే ఆనందం చెప్పలేనిది" అని అన్నారు. బంధువుల కంటే స్నేహితులను కలవడం మరింత ఆనందాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి మాజీ డీజీపీ శైలేంద్ర బాబు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు వంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందని ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa