ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రేమ సంబంధాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ 'కమ్యూనికేషన్' అని ప్రముఖ నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. తన రాబోయే చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాలం, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అంతులేని అవకాశాల వల్ల సంబంధాలలో అలసట పెరిగిపోయిందని, దీనివల్ల ప్రేమ బంధాలు కూడా పెళుసుబారిపోయాయని ఆమె అభిప్రాయపడ్డారు.ఒక నటిగా తన వృత్తి జీవితంలోని సవాళ్ల గురించి కూడా మృణాల్ పంచుకున్నారు. "కొన్నిసార్లు మేము పోషించే పాత్రల కోసం ప్రతికూల మానసిక స్థితిలో ఉండాల్సి వస్తుంది. ఆ ప్రభావం మనకు తెలియకుండానే మన భాగస్వామి, కుటుంబ సభ్యులు లేదా స్నేహితులపై పడొచ్చు. అందుకే, ఒక నటిగా నేను నా పాత్రలను ఇంటికి తీసుకురాకుండా ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ఇది అంత సులభం కాదు" అని ఆమె వివరించారు.ఈ సందర్భంగా పాతతరం ప్రేమకథల్లోని మాధుర్యాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. "ఒకసారి నేను అభిమన్యు దసాని తల్లి, ప్రముఖ నటి భాగ్యశ్రీ గారితో సమయం గడుపుతున్నప్పుడు ఆమె తన ప్రేమకథ గురించి చెప్పారు. వారంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ కోసం ఆమె పీసీఓ వద్ద ఎదురుచూసేవారట. సిగ్నల్ లేని చోట ఆ ఒక్క కాల్ కోసం పడిగాపులు కాసేవారట. ఆ రోజుల్లో ఒకరి సమయానికి, మాటకు ఎంతో విలువ ఉండేది. కానీ ఇప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఆనాటి నిరాడంబరమైన ప్రేమలో ఉన్న స్వచ్ఛత, విలువ తగ్గిపోయాయి. ఆ పాత రోజుల్లోని ప్రేమే బాగుండేది" అని మృణాల్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa