ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని ఆవిష్కరించిన కరీనా

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2019, 03:55 PM

బాలీవుడ్ నటి, పటౌడీ వంశం కోడలు కరీనా కపూర్ ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల మరియు మహిళల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీలను శుక్రవారం ఆమె మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. టోఫీల ఆవిష్కరణ తర్వాత కరీనా కపూర్ ఖాన్ స్టేడియంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని, స్టేడియంలో లోపల సచిన్ ఫోటో పక్కనే ఫోజులిచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అరుదైన గౌరమంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అలాగే ఆయా దేశాల తరుపున ఆడుతోన్న మహిళా క్రికెటర్లంతా తమ కలలను సాకారం చేసుకునే దిశగా వారిని ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పారు. ఇంతటి అంతర్జాతీయ టోర్నీలో వారు పాల్గొనడం గొప్ప విషయమని, వారంతా మనకు ఆదర్శమని కరీనా కపూర్ కొనియాడారు. తన మామగారు (మన్సూర్‌ పటౌడీ అలీఖాన్‌) కూడా ప్రముఖ క్రికెటర్‌ అని ఈ సందర్భంగా కరీనా గుర్తు చేశారు. ట్రోఫీని ఆవిష్కరించడం చాలా గౌరవంగా ఉందని తెలిపారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌-1లో ఉన్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌-2లో ఉన్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్‌ జట్టుతో తలపడుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa