ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ లక్షణం ఏఎన్నార్ నుంచి నేర్చుకున్నా: బాలకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 25, 2017, 11:31 AM

ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు లాంటి వారని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ, సమయం విలువను తెలుసుకుంటే.. పొగడ్తలకు దూరంగా ఉండటం ఏఎన్నార్ నుంచి నేర్చుకున్నానని బాలకృష్ణ చెప్పారు.ఆదివారం సాయంత్రం విజయవాడలో జరిగిన ‘జైసింహా’ ఆడియో విడుదల వేడుకలో బాలయ్య తన వాగ్ధాటితో అభిమానులను ఆకట్టుకున్నారు. ‘కనకదుర్గమ్మ ఉగ్గుపాలు తాగి.. కృష్ణవేణమ్మ ఉత్తుంగ తరంగాలలో ఉయ్యాలలూగి ఉర్రూతూలుగుతున్న ప్రాంతం మన కృష్ణాజిల్లా. మానవతారూపులైన ఎందరో మహానుభావులకు ఈ గడ్డ జన్మనిచ్చింది’ అంటూ ప్రారంభమైన బాలయ్య ప్రసంగం సుదీర్ఘంగా సాగింది.‘జైసింహా’ చిత్రం ఆడియోను అమరావతిలో విడుదల చేయడం సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ తీసిన ‘జయ సింహా’ పెద్ద బ్లాక్ బస్టర్ అని.. ఇప్పుడు అదే పేరుతో తీసిన ‘జైసింహా’ కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కె.ఎస్‌.రవికుమార్‌కు తాను పెద్ద ఫ్యాన్‌ను అని, ఎనిమిదేళ్ల నుంచి ఆయనతో పనిచేయాలని చూస్తున్నానని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa