మహేష్బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దిల్ రాజు సమర్పణలో నిర్మాణమవుతున్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం (అనిల్) సుంకర నిర్మిస్తున్నారు. రష్మిక, విజయశాంతి ప్రధాన పాత్రధారులు. చిత్ర విశేషాలను నిర్మాత అనిల్ సుంకర్ మీడియాకు వివరించారు.
ఎలాంటి ఇబ్బంది లేకుండా 140 రోజుల్లో సరిలేరు నీకెవ్వరు చిత్రీకరణ పూర్తిచేశాం. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తయింది. సెన్సార్కు సిద్ధమైంది. యూనిట్ అందరికీ గర్వపడే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. మహేష్ బాబుని అభిమానులు, ప్రేక్షకులు ఎలా చూడాలని భావిస్తున్నారో అలాగే ఉంటుంది. 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత విజయశాంతి నటించారు. మహేష్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఈ సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా. సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ భారతీయ సైనికులను ఉద్దేశించిందే. హీరో కూడా సైనికుని పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాతో వారికి మరింత గౌరవం పెరుగుతుంది. ఆర్మీ మేజర్ రాయలసీమకు వస్తాడు. ఆ తర్వాత ఏం చేశాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ వేయడం జరిగింది.
సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణ ట్రైన్ ఎపిసోడ్. దాదాపు అరగంట పాటు ఉంటుంది. ఈ ఎపిసోడ్ చూస్తూ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. దేవిశ్రీప్రసాద్ మంచి బాణీలు ఇచ్చారు. వాటిని విజువల్గా చూస్తున్నపుడు ఇంకా బాగా అనిపిస్తుంది.ప్రతి పాట వేరేవరికి సూటవదు అనే విధంగా మ్యూజిక్ ఉంటుంది. సినిమాలో ఇతర పాత్రధారుల్లో రాజేంద్రప్రసాద్, బండ్ల గణష్ క్యారెక్టర్స్ కూడా చాలా బావుంటాయి.ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవిగారు అతిథిగా రాబోతు న్నారు. దీనికి మెగా సూపర్ ఈవెంట్ అని పేరు పెట్టాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa