విడుదలైన ప్రతి చోట విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ విజయోత్సవాన్ని సంబరాలు పేరుతో హైదరాబాద్లో నిర్వహించారు. చిత్ర యూనిట్ సభ్యులు అంతా పాల్గొని సినిమా గురించి మాట్లాడారు.
చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ ”కథలో సందేశం ఉంది. యువతని ఆకట్టుకునే అంశాలు లేవనే సందేహాన్ని దర్శకుడు మారుతి వద్ద వ్యక్తం చేశాను. కానీ ఆయన ఎంతో నమ్మకంతో సినిమా పూర్తిచేశారు. సాయితేజ్కు మంచి సక్సెస్ వచ్చింది” అని అన్నారు.
గీత రచయిత సీతారామశాస్త్రి మాట్లాడుతూ ”విదేశాలకు వెళ్లిన తర్వాత మనుషుల మధ్య ప్రేమ అభిమానాలు తగ్గాయి. ఈ పాయింట్ ప్రేక్షకులకు నచ్చింది. దీనికి బాగా కనెక్ట్ అయ్యారని” అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ స్పందిస్తూ కష్టమైన కథని దర్శకుడు మారుతీ ఈజీగా డీల్ చేశాడని అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ ”పేరెంట్స్ని మిస్సవుతున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా సినిమా చేయాలనే ఆలోచన తొలుత సాయితేజ్లో పుట్టింది” అని చెప్పారు. హీరో సాయితేజ్ మాట్లాడుతూ ”ప్రతిరోజూ పండగే చిత్రానికి నా కెరీర్లో చాలా ప్రత్యేకత ఉంది. సత్యరాజ్, రావు రమేష్ చేసిన సన్నివేశాలు బాగా వచ్చాయి. ఈ సక్సెస్ను మెగా అభిమానులకు, ప్రేక్షకులకు అంకితం చేస్తున్నా” అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa