ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాధవీలత సంచలన పోస్ట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2020, 12:51 PM

పలు సామాజిక విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది తెలుగు హీరోయిన్ మాధవీ లత. అప్పుడప్పుడు టీవీ చర్చా వేదికల్లో కనిపిస్తుంటుంది. నచ్చావులే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమైంది. తెలుగుదనం ఉట్టిపడేట్లు ఉండటం మాధవీలత ప్రత్యేకత. ఎప్పుడు ఇతరత్రా విషయాలపై స్పందించే మాధవీ లత ఇప్పుడు ఓ సంచలన పోస్టు పెట్టి వార్తల్లో నిల్చింది. తనను అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని త్వరలోనే నేను చచ్చిపోతానని పేర్కొంది. ఎదో ఒక రోజు “ప్రేమ” సినిమా లో రేవతిలాగే తాను చనిపోతానిని నేనెపుడు నా ఫ్రెండ్సుతో చెప్తూ ఉంటానని పేర్కొంది. సినిమాలో లాగానే తాను ఎపుడు ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటానని… ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా తాను చనిపోతానని తెలిపింది. మైగ్రేన్ తలనొప్పి , జలుబు, జ్వరం, నిద్రలేమి సమస్యలు వేధిస్తున్నాయని తెలిపింది. వీటికోసం మందులున్నా … ఈ మందులు అవి నా ఆయుష్షు ఉంచవేమో అంటూ సంచలన పోస్టు పెట్టింది మాధవీ లత.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa