ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘పవన్’ కోసం తాజ్ మహల్..చార్మినార్ సెట్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2020, 07:57 PM

పవర్ స్టార్   పవన్ కళ్యాణ్  నటిస్తోన్న   ‘పింక్’ రీమేక్ కు   నిర్మాత  దిల్ రాజు  భారీ  బడ్జెట్ ను  పెడుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా  పూర్తి  అవ్వాలనే  ఉద్దేశ్యంతో  ఔట్ డోర్  షూటింగ్స్  కంటే  ఎక్కువగా  భారీ  సెట్టింగ్స్  వేసి  ఇండోర్ లోనే  నిర్వహించాలని  భావిస్తున్నాడట. అందుకే  ఈ  చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం భారీ స్థాయిలో తాజ్ మహల్ సెట్టింగ్ ను వేయబోతున్నారట. అలాగే చార్మినార్ సెట్టింగ్ ను కూడా నిర్మిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమీనియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం కోసం భారీ ఎత్తున సెట్టింగ్స్ ను నిర్మించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అలాగే సినిమా లో కీలకమైన ఇతర సీన్స్ తీసేందుకు వీధి సెట్లు .. కోర్టు సెట్ ను కూడా నిర్మిస్తున్నారట.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa