కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్ 2' సినిమా సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ మధ్యప్రదేశ్, గ్వాలియర్ ప్రాంతంలో జరిగింది. కొత్త షెడ్యూల్ కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో భారీ సెట్స్ వేస్తున్నారు. అందులో 150 అడుగుల ఎత్తులో క్రేన్తో లైటింగ్ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా అది తెగి కిందనే ఉన్న టెంట్పై పడింది. ఈ ప్రమాదం లో ముగ్గురు మరణించగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో శంకర్ పర్సనల్ సెక్రటరీ మధు, సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ, సహాయకుడు చంద్రన్ ఉన్నారు. ఈ ఘటన పట్ల కమల్ హాసన్ , కాజల్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం తన మనసుని కలిచివేసిందని, ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరమన్నారు. అలాగే మరణించిన కుటుంబాలకు కోటి రూపాయల సహాయాన్ని అందిస్తున్నట్టు కమల్ హాసన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa