అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా తో హిట్ కొట్టిన మహేష్ బాబు . ఆయన తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కాల్సింది. అయితే, కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యం అయ్యేలా ఉందట. ఈ నేపథ్యంలో మహేష్ కొత్త కథలు కోసం చూస్తున్నటు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల గరుడవేగ దర్శకుడు ప్రవీణ్ సత్తారు మహేష్ కి ఓ కథ వినిపించినట్టు సమాచారమ్.
ప్రవీణ్ చెప్పిన కథకు మహేశ్ ఇంప్రెస్ అయ్యాడని అంటున్నారు. కథ నచ్చడంతో కొద్దిపాటి మార్పులు కూడా చెప్పాడని సమాచారం. ఈ సినిమాపై త్వరలోనే క్లారిటీ రానుంది. యువ దర్శకులకి అవకాశం ఇవ్వాలని మహేష్ భావిస్తున్నారు. గతంలో సందీప్ రెడ్డి వంగాతో మహేష్ ఓ సినిమా చేయాలనుకొన్నారు. కానీ, కొన్ని కారణావల వలన అది జరగలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa