స్టార్ డైరెక్టర్ శంకర్ – గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వస్తోన్న ‘భారతీయుడు 2’ సెట్లో తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈవీపీ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ప్రదేశంలో పెద్ద క్రేన్ పడి శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు చిత్రబృందంలోని మరో ఇద్దరు సభ్యులు కూడా చనిపోయారు.
ఆ ప్రమాదంలో కృష్ణ అనే సహాయ దర్శకుడు, చంద్రన్ అనే సహాయ కళాదర్శకుడు, మధు అనే మరో సహాయకుడు ప్రాణాలను కోల్పోయారు. కాగా ఆ సంఘటన జరిగిన ప్రాంతంలో చిత్ర యూనిట్తో పాటు నటి కాజల్అగర్వాల్ కూడా ఉంది. అంతే కాదు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆ సంఘటనను చాలా దగ్గరగా చూసింది. దీంతో చాలా దిగ్భ్రాంతికి గురైన కాజల్అగర్వాల్ ఆ షాక్ నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టిందని చెప్పింది. కాగా ఈ సంఘటన తరువాత కాజల్అగర్వాల్ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయిందట.
మహాశివరాత్రి సందర్భంగా ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్లో నిర్వహించిన కార్యక్రమంలో మాత్రం పాల్గొన్న కాజల్అగర్వాల్ ఆ తరువాత ఇంటి నుంచి బయటకు రాలేదట. అంతే కాదు మరో రెండు వారాల పాటు చిత్ర షూటింగ్లోనూ పాల్గొనని ఇండియన్–2 చిత్ర నిర్మాతలకు ఖరాఖండీగా చెప్పినట్లు సమాచారం. కాగా కాజల్అగర్వాల్ తమిళంలో దుల్కర్సల్మాన్కు జంటగా మరో చిత్రంలోనూ నటిస్తోంది. ఆ చిత్రం నిర్మాణంలో ఉంది. మరి ఆ చిత్ర షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటుందో మరి. అదేవిధంగా తెలుగులో మోసగాళ్లు అనే చిత్రంలోనూ, హిందీలో ఒక చిత్రం చేస్తూ ఈ అమ్మడు బిజీగా ఉంది. ఇకపోతే 34 ఏళ్ల కాజల్అగర్వాల్కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసే పనిని వేగవంతం చేస్తున్నారట. మరో పక్క ఈ భామ ఒక పారిశ్రామిక వేత్తతో ప్రేమలో ఉందనే ప్రచారం హల్చల్ చేస్తోంది. వీటిలో ఏది నిజం అన్నది కాజల్ చెబితేనే గానీ తెలిసే అవకాశం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa