ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి పవన్ సరసన శృతి..

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2020, 09:20 AM

పవన్ కళ్యాన్‌తో ముచ్చటగా మూడోసారి శృతి హాసన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.గతంలో హరీష్, పవన్ కాంబినేషన్‌లో అప్పట్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దాంతో ఇప్పుడు హరీష్ పవన్ చేయబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించనుందనేది సమాచారం. శృతిహాసన్ గతంలో పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పవన్ చేసిన ‘కాటమరాయుడు’లో మరోసారి పవన్ సరసన మెరిసింది శృతి.ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో ఆమె ఏ సినిమా చేయలేదు. చాలా రోజుల తర్వాత శ‌ృతి రవితేజ ‘క్రాక్’లో చేస్తోంది.పవన్ శ‌ృతి జోడీకి మంచి క్రేజ్ ఉండటంతో హరీష్ ఆమెను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వేణు శ్రీరామ్, క్రిష్ చిత్రాల్లో ఒకటి పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa