సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమన్నా జంటగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో రాబోతుంది. ఈ సినిమాక 'సిటీమార్' ఫిక్స్ చేసారు. అయితే ప్రస్తుతం గోపీచంద్ పై ట్రైన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు సపంత్ నంది. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఈ ట్రైన్ సీక్వెన్సెస్ పూర్తి యాక్షన్ తో సాగుతుందట. సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోందట. అన్నట్టు గోపీచంద్ తో పాటు తమన్నా కూడా ఈ సీక్వెన్స్ షూట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్కి కోచ్గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్గా చేస్తోంది. కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్స్తో ఈ సినిమా ఉండబోతుందట. కాగా ‘యు టర్న్’లాంటి సూపర్హిట్ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ (ప్రొడక్షన్ నెం. 3) పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa