ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ ఇంట్లో ఐటీ దాడులు తరవాత అధికారుల సంచనల ప్రకటన !

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2020, 12:25 PM

కోలీవుడ్ హీరో విజయ్‌కి ఐటీ అధికారులు షాకిచ్చారు. హీరో విజయ్‌కి చెందిన ఇళ్లు, బిగిల్ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్ కార్యాలయాలతో పాటు.. ఆ సినిమా ఫైనాన్షియర్ అన్బుచెలియన్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి., గత రెండు రోజులుగా మరోసారి దాడులు చేశారు. విజయ్ నటించిన 'బిగిల్', ఇప్పుడు నటిస్తున్న 'మాస్టర్' చిత్రాలకు సంబంధించిన పారితోషికాలపై ఆరా తీశారు. 'బిగిల్' సూపర్ హిట్ కాగా, ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సమర్పించిన లెక్కల్లో తప్పులు ఉన్నాయని గుర్తించిన ఐటీ శాఖ అధికారులు, ఏజీఎస్ కార్యాలయాలతో పాటు, దానికి రుణమిచ్చిన అన్బు చెళియన్ పైనా దాడులు చేశారు.వాటి ఆధారంగానే గత నెలలో షూటింగ్ లో ఉన్న విజయ్ ని తీసుకెళ్లి, రెండు రోజులు విచారించారు. ఆపై విజయ్ తిరిగి షూటింగ్ లో బిజీ అయిపోగా, మంగళవారం సాయంత్రం నుంచి నిన్న మధ్యాహ్నం వరకూ 'మాస్టర్' నిర్మాత లలిత్ కుమార్ ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు.ఆపై మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన అధికారులు, విజయ్ వద్ద ఎటువంటి అక్రమ సంపాదనా లేదని స్పష్టం చేశారు. తాను నటించిన సినిమాలకుగాను ఆయన తీసుకుంటున్న పారితోషికానికి సంబంధించిన పన్నులన్నీ సక్రమంగానే చెల్లించారని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa