కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది.. చైనాలో పుట్టిను 115 దేశాల్లో విస్తరించిన ఈ మాయదారి రోగం.. ఎప్పుడు ఎవరిని ఎటాక్ చేస్తోందో తెలియని పరిస్థితి.. ప్రభుత్వాలు కూడా సీరియస్గా తీసుకుని ఈ వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే పూర్తిగా సెలవులు ఇచ్చేసారు.. ప్రజలను ఇంటికే పరిమితం కావాలని హుకూం జారి చేసారు. ఇప్పటికే చాలా చోట్ల ఇది అమలులో ఉంది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం కూడా ఇదే చేసింది. కరోనా వైరస్ను అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇండియాలో తొలి కరోనా మరణం కర్ణాటకలో రాష్ట్రంలోనే ఉంది. దాంతో అక్కడి స్కూల్స్, షాపింగ్ మాల్స్, పెళ్లి మంటపాలతో పాటు థియేటర్స్ను కూడా మూసేయాలని అక్కడి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆదేశాలు జారీ చేసారు.ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు ఇండియాలో ఒక్కరు మరణించగా.. దాదాపు 75 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు. సినిమా ఇండస్ట్రీపై కూడా కరోనా వైరస్ ప్రభావం చాలా పడుతుంది. కలెక్షన్లు లేక థియేటర్స్ అన్నీ వెలవెలబోతున్నాయి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ అరికట్టాలంటే థియేటర్లను మూసివేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. దాంతో పాటు మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ కొన్ని రోజుల పాటు మూసేయాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆదేశించాడు.ఎలాగూ జనాలు లేక కళతప్పడంతో థియేటర్ల యజమానులతో పాటు మాల్స్ ఓనర్స్ కూడా దీనికి ఓకే చెప్పేసారు. దాంతో కర్ణాటకలో మరికొన్ని రోజుల పాటు సినిమాలు.. షికార్లు ఉండవన్న మాట. ఇప్పటికే అక్కడ విడుదలకు సిద్ధమైన కొన్ని సినిమాలను వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. అందులో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఏదేైమనా ఏదేమైనా కూడా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa