కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. కరోనా దాటికి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ వైరస్ పై అవగాహన కల్పించడానికి సినీ ప్రముఖులు కూడా ముందుకు వస్తున్నారు. చిరంజీవి,మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.యాంకర్ సుమ ప్రత్యక్షంగా చేసి మరీ చూపించింది. శానిటైజర్ను ఎలా వాడాలి, చేతులు ఎలా శుభ్రంగా కడుక్కోవాలి, కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో సందేశం ద్వారా వివరించింది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా తమ తమ అభిమానులు, ఫాలోవర్స్, తెలుగు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ కరోనాపై అవగాహన కలిగిస్తున్నారు.తాజాగా నాని కూడా స్పందించాడు. నాని చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు చివరకి మనిషికి మనిషే.. మనదంతా ఓ పెద్ద కుటుంబం.. ఒకరిపట్ల ఒకరు జాగ్రత్తగా వ్యవహరించాలని ట్వీట్ చేశాడు.
పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్ తొక్క తోలు ఏమీ ఉండదు చివరకి
మనిషికి మనిషే
We are all one big family and we need to take care of each other #BeResponsible #BeSafe
— Nani (@NameisNani) March 17, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa