ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ హీరోస్ అంత ఒకటే మాట జనతా కర్ఫ్యూని పాటిద్దాం..

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 21, 2020, 12:27 PM

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 11 వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌తో విశ్వవ్యాప్తంగా ఆరోగ్య పరిస్థితులు దిగజారాయని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.. ఇప్పటి వరకూ భారత్ లో 258 కేసులు నమోదు కాగా అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలలో 22 కేసులున్నాయి.. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. దీనిపై టాలీవుడ్ సినీ సెలబ్రిటీస్ స్పందిస్తూ జనతా కర్ఫ్యూకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబుతో సహా ప్రముఖలందరూ విడివిడిగా ప్రకటనలు విడుదల చేస్తూ ప్రజలంతా స్వచ్చందంగా బంద్ పాటించి కరోనా వైరస్ కు బ్రేక్ చెప్పాలని కోరారు.. ఇక పవన్ కళ్యాణ్ కరోనా వైరస్ పట్ల ప్రధాని చేసిన సూచనలను స్వాగతిస్తున్నట్లు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశారు. ''మోడీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. ఈ నెల 22వ తేది ఆదివారం మోడీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూని పాటిద్దాం.. ఆరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదాం.. కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు.. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. జనతా కర్ఫ్యూ రోజు ప్రతి ఒక్కరు ఇళ్ల బాల్కనీలోకి వచ్చి తమ కరతాళ ధ్వనులతో కానీ, ఏదైనా నాదం ద్వారా కానీ సంఘీబావం తెలుపుదాం.. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మన అందరూ మమేక మవడం విధిగా భావిద్దాం. మోడీ గారి పిలుపునకు దేశమంతా స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా 24 క్రాఫ్ట్‌కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో విధిగా పాల్గొనాలి అని ఆర్ధిస్తున్నాను. ప్రధాని మాట పాటిద్దాం కరోనా విముక్త భారతాన్ని సాదిద్ధాం'' అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు శాల్యూట్ చేద్దామని అన్నాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలని, మనం వారికిచ్చే గౌరవం వాటిలో కనిపించాలని అన్నాడు. ప్రధాని పిలుపును అందరూ పాటించాలని, కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని మహేష్ పిలుపునిచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa