కరోనా వ్యాపించకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ట్విట్టర్ ద్వారా ఓ వీడియో విడుదల చేశాడు తమిళ స్టార్ నటుడు సూర్య. వరదలు, తుపాన్లు, జల్లికట్టు వంటి వాటి విషయంలో రోడ్డెక్కి పోరాడామని, ప్రస్తుతం కరోనాపై ఇంట్లో ఉండే పోరాడుదామని పిలుపునిచ్చాడు. చైనా కంటే ఇటలీలోనే కరోనా కారణంగా ప్రాణనష్టం అధికంగా ఉందని తెలిపాడు. కరోనా తీవ్రతను గ్రహించకుండా ఇటలీ ప్రజలు బయట తిరగడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నాడు. భారత్ మరో ఇటలీ కాకూడదని పేర్కొన్నాడు. సామాజిక దూరం పాటించాలని సూర్య కోరారు. ముఖాన్ని చేతులతో ముట్టుకోకూడదని, జ్వరం, దగ్గుతో బాధ పడుతుంటే కరోనా వైరస్ సోకినట్లు కాదని, అయినప్పటికీ ఆరు రోజులు ఎవరితోనూ కలవకుండా ఉండాలని, అప్పటికీ సమస్య ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని కోరారు. భారత్లోనూ కరోనా వేగంగా విస్తరిస్తోందని అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa