ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 25, 2020, 02:30 PM

ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ గురించే ఇప్పుడు ప్రపంచ దేశాల చర్చ. ఇప్పటికే ఈ మహమ్మారిపై అవగాహన కల్పిస్తున్నారు సినీ ప్రముఖులు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తన వంతు సహాయం చేయడానికి హీరో నితిన్ ముందుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనాను ఎదుర్కొవడానికి తనవంతుగా రూ. 20 లక్షల విరాళం ప్రకటించారు. కరోనా నిర్మూలనకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో కృషి చేస్తున్నాయని ప్రశంసించిన ఆయన, ప్రజలందరూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల చొప్పున విరాళాన్ని అందజేయనున్నట్టు నితిన్ తెలిపారు. నితిన్ చేసిన పనిపై ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa