దేశమంతా లాక్ డౌన్ అయ్యింది మరోవైపు సినిమా షూటింగులు కూడా నిలిపివేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆర్టిస్టులంతా కలవరానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ జబర్దస్త్ పై కూడా పడింది. ముఖ్యంగా జబర్దస్త్ యాంకర్ రోజా శుక్రవారం ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనిపించలేదు. ఆమె బదులు శేఖర్ మాస్టర్ వచ్చారు. అయితే రోజా స్టే హోం లో భాగంగా ఇంటికే పరిమితం అయ్యారని, అందుకే జబర్దస్త్ షూటింగ్ కు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జబర్దస్త కొత్త ఎపిసోడ్స్ కూడా షూటింగ్ నిలిపి వేసినట్లు సమాచారం. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్టిస్టులంతా ఇప్పటికే ఇంటికి పరిమితం అయిపోయారు. అటు కొత్త ఎపిసోడ్ షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఆర్టిస్టులంతా ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం అని వాపోతున్నారు. జబర్దస్త్ షూటింగ్ అంటే తమకు పండగ అని, జబర్దస్త్ నే నమ్ముకొని కొందరు ఆర్టిస్టులు తమ జీవితం గడుపుతున్నారు. దీంతో అటు షూటింగులు లేక, ఈవెంట్స్ లేక జబర్దస్త్ ఆర్టిస్టులంతా విలవిలలాడుతున్నారని సమాచారం అందుతోంది. పెద్ద ఆర్టిస్టులు సుధీర్, హైపర్ ఆది, అనసూయ, రష్మీ లాంటి స్టార్ ఆర్టిస్టులకు ఆర్థికంగా ఇబ్బందులు లేకపోయినా మిగితా చిన్న ఆర్టిస్టులకు మాత్రం ఈ లాక్ డౌన్ పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఎపిసోడ్ చొప్పున పేమెంట్ అందుకునే వీరంతా షూటింగులు లేకపోవడంతో తమ భవిష్యత్ ఎలా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగులు లేని కారణంగా తమ యాజమాన్యమే పట్టించుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa