కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమ తాత్కాలికంగా మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ కార్మికుల సంక్షేమం నిమిత్తం హీరోలు, దర్శకులు, నిర్మాతలు వారికి తోచిన విరాళాన్ని వారు ప్రకటించారు. అయితే, ఇంత వరకు ఒక్క హీరోయిన్ కూడా విరాళం ప్రకటించలేదు. తాజాగా హీరోయిన్ ప్రణీత తన వంతుగా రూ. లక్ష విరాళాన్ని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.ఈ సందర్భంగా ప్రణీత మాట్లాడుతూ, ఈ కష్ట కాలంలో ఒక్కో కుటుంబానికి కనీసం రూ. 2 వేలు అవసరమని... తమ ప్రణీత ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయలతో 50 కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పింది. తాను చేస్తున్న సాయం చాలా చిన్నదే అని తెలిపింది. ఎఫర్ట్స్ ఫర్ గుడ్, లాజికల్ ఇండియన్ సంస్థలతో కలిసి హెల్ప్ ద హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రణీత ఫౌండేషన్ 500 కుటుంబాలకు సాయం చేసేందుకు సన్నాహకాలు చేస్తోందని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa