కరోనా బారిన పడి ప్రముఖ అమెరికా కంట్రీ సింగర్ జోయ్ డిఫ్పీ కన్నుమూశారు. మూడు రోజుల క్రితం జోయ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 రోజుల క్రితం జోయ్ సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తాను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని భయం అక్కర్లేదని తెలిపారు.సోషల్ మీడియలో జోయ్ మాట్లాడుతూ “ నేను, నా కుటుంబం ఈ సమయంలో ప్రైవసీని కోరుకుంటున్నాం. అభిమానులకు మేమొక్కటే చెప్పదల్చుకున్నాం.. కరోనా మహమ్మారినుంచి తప్పించుకోవటానికి చాలా జాగ్రత్తగా ఉండండి” అని తెలిపారు. జోయ్ జిఫ్ఫీ ఓకహోమలో జన్మించారు. ఆయనకు 61 సంవత్సరాలు. 1990లలో ‘ పికప్ మ్యాన్’ ప్రాప్ మి అప్ బిసైడ్ ది జ్యూక్ బాక్స్ వంటి చాలా హిట్ సాంగ్స్ను ఆయన స్వరపరిచారు. గ్రామీ అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు. జోయ్ డిఫ్ఫీ మృతితో అమెరికాలో విషాద చాయలు అలుముకున్నాయి.కరోనా బారిన పడి మరో అమెరికన్ సింగర్ జాన్ ఫ్రైన్ చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జాన్ కు 73 సంవత్సరాలు. అతనికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa