కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో సినిమా కార్మికులు కూడా ఆకలిలో అలమటిస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్లో కరోనా క్రైసెస్ ఛారిటీకి ఏర్పడింది. ఇప్పటికే పలువురు ఈ ఛారిటీకి తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. మరి కొంత మంది తమకు తోచిన రీతితలో పేదలకు సాయం చేస్తున్నారు. ఐతే.. టాలీవుడ్ కమెడియన్ శివారెడ్డి తన వంతు సాయం చేస్తున్నాడు. తాజాగా ఆయన లాక్డౌన్ నేపథ్యంలో పనిలేకుండా పోయిన 500 మందికి భోజన ఏర్పాట్లు చేసాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శివా రెడ్డిని అభినందించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ఎవరికి వారు ముందు వచ్చి తమకు తోచిన సాయం చేయాలని పిలుపునిచ్చారు. మొత్తానికి కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సినిమా నటులు తమ వంతు సాయం చేస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa