ట్రెండింగ్
Epaper    English    தமிழ்

25,000 పీపీఈలను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించిన షారుఖ్‌ ఖాన్‌

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2020, 02:24 AM

బాలీవుడ్‌ నటుడు షారుఖ్ ఖాన్‌ తన వంతు సాయంగా వైద్య సిబ్బంది కోసం 25,000 వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ)లను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందచేశారు. ఆయన చేసిన సాయానికి మహారాష్ట్ర ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేశ్‌ తోపే కృతజ్ఞతలు తెలిపారు.షారుఖ్‌ ఖాన్‌ చేసిన సాయం కరోనాపై జరుపుతోన్రేన పోరాటంలో చాలా మేలు చేస్తుందని రాజేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మనల్ని, మానవాళిని కాపాడుకునే ఈ ప్రయత్నంలో మనందరం కలిసి పోరాడాలని షారుఖ్ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. ప్రభుత్వానికి సాయం చేయగలిగినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. అందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.కాగా, ఆయన ఇప్పటికే తన కార్యాలయాన్ని మహిళలు, వృద్ధులు, చిన్నారులకు వైద్య సహాయం అందించే క్వారంటైన్‌ కేంద్రంగా ఉపయోగించుకోవచ్చని ప్రకటించారు. కోల్‌కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రెడ్‌ చిల్లీస్‌ వీఎఫ్‌ఎక్స్‌ వంటి సంస్థల సాయంతో షారుఖ్ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పలు సంస్థలు మాస్కులను కూడా తయారుచేస్తున్నాయి కరోనాపై పోరుకు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు సాయం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa