మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా సినిమా షూటింగ్ ఆగింది. ప్రారంభంలో ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్ ఆగింది. దీంతో మూవీ విడుదల వాయిదా పడుతుందని వార్తలు వినపడుతున్నాయి.ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ప్రాచీన కాలం నాటి ఆలయాలు .. ఆక్రమణకి గురైన వాటి భూములకు సంబంధించిన నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే టాక్ వినిపించింది.అయితే తాజాగా చిరంజీవి ఓ ఆంగ్ల దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అనీ, ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటంగా సాగుతుందని చెప్పారు. ఇందులో దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన అంశం కూడా వుండే అవకాశం వుంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది అంటున్నారు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa