అడివి శేష్ కి కథాకథనాలపై మంచి పట్టువుంది. నటుడిగాను ఆయన తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆ అయన 'మేజర్' సినిమా చేస్తున్నాడు. అలాగే 'గూఢచారి' సినిమా సీక్వెల్ ను పట్టాలెక్కించే పనులు చేయిస్తున్నాడు. అడివి శేష్ కి ఈ మధ్య కాలంలో వరుస విజయాలు దక్కుతున్నాయి. దాంతో ఆయన దర్శకుల పనిలో జోక్యం చేసుకుంటూ వాళ్లను విసిగిస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ .. "కథా .. కథనాల విషయంలో నేను కూర్చుంటాను. కానీ దర్శకుల పనిలో జోక్యం చేసుకుంటాననే విషయంలో ఎంత మాత్రం నిజం లేదు. దర్శకుల ప్రతిభాపాటవాల కారణంగానే నాకు విజయాలు దక్కాయనీ, ఈ రోజున ఈ స్థానంలో వున్నానని భావిస్తున్నాను. వాళ్ల క్రెడిట్ ను కొట్టేయాలని నేనెప్పుడూ అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa