మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ కూడా పెట్టేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్తో ఈ సినిమా షూటింగ్కు సైతం బ్రేకులు పడ్డాయి. 2020 దసరాకు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జూలై వరకు ఎలాంటి షూటింగ్స్ జరిగే పరిస్థితులు లేవు. దీంతో ఈ సినిమా వచ్చే యేడాదే ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత కూడా వరుసగా దర్శకులకు ఆఫర్స్ ఇచ్చేస్తున్నాడు మెగాస్టార్. ఓ వైపు స్ట్రెయిట్ సినిమాలు చేస్తూనే.. కథ నచ్చితే రీమేకులు కూడా చేయాలని చూస్తున్నాడు చిరు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నాడు చిరంజీవి. ఈ సినిమాను ఇక్కడ చేయాలని చిరు భావిస్తున్నాడు. ఐతే.. ఈ సినిమా చేయమని చిరంజీవికి ప్రభాస్ సలహా ఇచ్చాడట. అంతేకాదు ఈ సినిమాను సుజిత్ దర్శకత్వంలో చేయమని చెప్పింది కూడా ప్రభాసేనట.ప్రభాస్.. సాహో సినిమాను రెగ్యులర్ గాడ్ ఫాదర్ తరహా కథతో తెరకెక్కించిన అందులో యాక్షన్ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ప్రేక్షకులును ఆకట్టుకున్నాయి. మరోవైపు ప్రభాస్ సలహా మేరకు చిరంజీవి కూడా ఈ రీమేక్ కథను ఓకే చేయడంతో పాటు సుజిత్తో ఈ రీమేక్ బాధ్యతలు అప్పగించాడు. సాహో తర్వాత ఈయనకు మరోసారి పెద్ద హీరోను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం వీడియో కాల్స్ చేసి కథను మార్చుతున్నట్లు తెలిపాడు మెగాస్టార్. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను కూడా ఈయన చేతుల్లో పెడుతున్నాడు చిరు. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించనుంది. డిసెంబర్ నుంచి లూసీఫర్ తెలుగు రీమేక్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు చిరంజీవి. ఆచార్య కూడా పొలిటికల్ థ్రిల్లరే.. లూసీఫర్ కూడా అంతే. ఈ రెండు సినిమాల్లో రామ్ చరణ్ రెండో హీరోగా నటించే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa