యాంకర్, నటి అనసూయ సోషల్మీడియాకు గుడ్బై చెప్పేసింది. తనతో కలిసి ఫొటో తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ బాలుడి ఫోన్ను పగలగొట్టారన్న కారణంగా అనసూయపై ఓ మహిళ కేసు పెట్టిన ఘటన దుమారం రేపింది. జరిగిన సంఘటన విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు అనసూయ ప్రయత్నించినా.. నెటిజెన్లు శాంతించలేదు. దీంతో మనస్థాపం చెందిన అనసూయ తన సోషల్ మీడియా అంకౌట్లు డిలీట్ చేసింది.
ఆమె ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కన్పించడంలేదు. సోషల్మీడియాలో ఎదురవుతున్న కామెంట్లు తట్టుకోలేక ఆమె అన్ని మాధ్యమాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా ఉన్న అనసూయ వెండితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న అనసూయ ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం, మోహణ్ బాబు గాయత్రి సినిమాలలో కీలక పాత్రలలో కనిపించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa