ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అల్లు అర్జున్' సినిమా విషయంలో ఆ రూమర్ నిజమేనా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 27, 2020, 12:10 PM

కరోనా వైరస్ చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులకు కారణం అవుతోంది. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ లకు వెళ్ళడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. స్టార్స్ ఇన్ని రోజులు లాక్ డౌన్ ఎత్తివేస్తే షూటింగ్ లు చేయాలని చెప్పారు కానీ.. పెరుగుతున్న కరోనా కేసులు వారిని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇక థియేటర్లలో సినిమాల రిలీజ్ కూడా ఇప్పట్లో కష్టమేనని అంటున్నారు. ఒకవేళ సినిమా థియేటర్లు ప్రారంభం అయినా.. మునుపటిలా హౌస్ ఫుల్ బోర్డులతో భారీ కలెక్షన్లు రావడం కూడా కష్టమేనని అంటున్నారు. దీంతో అప్పటి రేంజిలో కలెక్షన్లు సాధించాలంటే చాలా రోజులు సినిమా హాళ్లలో సినిమాలు ఆడాలి. అలాంటి పరిస్థితి కూడా లేదు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే బడ్జెట్. బడ్జెట్ తగ్గించుకుంటే కానీ నిర్మాతలకు లాభాలు రావని అంటున్నారు. ఇప్పటికే నటీనటులు చాలా వరకూ రెమ్యునరేషన్ లను తగ్గించుకుంటూ ఉన్నారు. ఇక బడ్జెట్ కూడా తగ్గించుకుంటే థియేటర్ రిలీజ్, ఓటీటీ, శాటిలైట్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్మాతలు బతికి బట్టకట్టవచ్చు.
టాలీవుడ్ లో ఈ మార్పు అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమా నుండే మొదలుకావచ్చనే వార్తలు ఫిలింనగర్ సర్కిల్స్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారు. పరిస్థితుల్లో మార్పులు రావడంతో చిత్రం బడ్జెట్టులో కూడా బాగా కోత పెడుతున్నారట. అందుకు తగ్గట్టుగా స్క్రిప్టులో చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాను దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీలో కూడా విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన నటిస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో చేయాలని ప్లాన్ చేస్తున్న తరుణంలో లాక్ డౌన్ ను అమలు చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa