ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెపోటిజంపై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందన

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 08:31 PM

తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన తమన్నా తర్వాత తెలుగు, తమిళ్ లో మంచి ఛాన్సులు కొట్టేసింది. ఆ తర్వాత హిందీ లో కూడా తన సత్తా చాటింది. బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రలో అప్సరసలా కనిపించింది. ఈ మద్య బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత బాలీవుడ్ లో సహనటులు అతని మరణం 'బంధుప్రీతి' తోనే జరిగిందని అంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు దీనిపై తన అభిప్రాయాలను వెల్లడించగా... తాజాగా నటి తమన్నా ఈ అంశంపై స్పందించింది.తమ కుటుంబంలో అందరూ డాక్టర్లేనని... సినీ పరిశ్రమతో సంబంధంలేని కుటుంబం నుంచి తాను వచ్చానని తమన్నా చెప్పింది. ముంబై అమ్మాయినైన తాను తెలుగు, తమిళ సినిమాలను చేయడం ప్రారంభించినప్పుడు తనకు ఈ భాషలు కూడా తెలియవని అంది. సినీ పరిశ్రమలో తనకు ఎవరితో పరిచయం లేకపోయినా.. తనకు అవకాశాలు వచ్చాయని చెప్పింది.తన ప్రతిభ, నిబద్ధతను చూసి తనకు అవకాశాలను ఇచ్చారని తెలిపింది.తన విజయాలకు, తన పరాజయాలకు తానే కారణమని చెప్పింది. బంధుప్రీతి, రాజకీయాలు అనేవి అన్ని రంగాల్లో ఉంటాయని... టాలెంట్ లేకపోతే నిలదొక్కుకోవడం కష్టమని తెలిపింది. తన పిల్లలు సినీ పరిశ్రమలోకి వస్తామంటే తాను ఎంకరేజ్ చేస్తానని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa