ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటి గురించి నేను పట్టించుకొను : నిత్య మీనన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 08:27 PM

క్యూట్ అండ్ బబ్లీ గా ఉండే నిత్యామీనన్ ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మాయి. నానితో అలా మొదలైంది సినిమాతో మొదలైన నిత్యా జర్నీ తెలుగు పరిశ్రమలో సక్సెస్ ఫుల్ గా సాగింది. ప్రస్తుతం ఈమె తెలుగులో కాకుండా ఇతర భాషల్లో నటిస్తుంది. తాజాగా ఆమె హిందీలో చేసిన మిషన్ మంగళ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ఫొటోస్ కొన్ని బయటకు వచ్చాయి. అందులో నిత్యా చాలా లావుగా కనిపిస్తుంది. ఇంతకుముందుతో పోల్చితే ఇంకా లావుగా కనిపిస్తున్నారు. మామూలుగానే బొద్దుగా ఉండే నిత్యా ఇంకొంచెం లావు అయ్యారు. దాంతో కొంతమంది నెటిజన్స్ సెటైర్స్ వేయగా నిత్యా వారికి ఘాటు సమాధానం ఇచ్చింది.  పలువురు నెటిజెన్లు ఆమెపై బాడీ షేమింగ్ (శరీరాన్ని చూసి వెక్కిరించడం)కు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.మనకంటే లావుగా ఉన్నవాళ్ల నుంచి మనకు విమర్శలు ఎదురుకావని... మనకంటే సన్నగా ఉండే వాళ్ల నుంచే విమర్శలు ఎదురవుతాయని నిత్య వ్యాఖ్యానించింది. అసలు బరువు ఎందుకు పెరుగుతున్నావని ఎవరూ ప్రశ్నించరని... ఎవరికి వారు ఏదో ఊహించుకుంటూ ఉంటారని... ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నారని, ఎవరి ఇష్టానికి వారు ఆలోచించుకుంటారని చెప్పింది.తన బరువు గురించి విమర్శలు ఎదురైనప్పుడు తాను ఎవరినీ ఎదురు ప్రశ్నించలేదని, బాధ పడలేదని తెలిపింది. ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలని చెప్పింది. ఇలాంటి వాటిని ఎవరికి వారే అధిగమించాలని చెప్పింది. ఇలాంటి కామెంట్లపై పోరాటం చేయడాన్ని తాను నమ్మనని వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీ వ్యక్తులు తనను చూస్తున్నారా? లేక తన బరువును చూస్తున్నారా? అనే విషయాన్ని తాను పట్టించుకోనని చెప్పింది. తన పని తాను చూసుకుంటూ పోతానని, తన పనే విమర్శకులకు సమాధానం చెపుతుందని వ్యాఖ్యానించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa