గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మంచి స్నేహితులు. ఇద్దరూ సంగీత ప్రపంచంలో దూసుకుపోయేవారు. అయితే అంతటి ప్రాణ స్నేహితుడు అయిన ఇళయరాజా ఎస్పీబీకి నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. బహిరంగ వేదికలపైనా పాటల కచ్చేరీలలో తన పాటలు పాడొద్దంటూ ఇళయరాజా తన మిత్రుడు ఎస్పీబీకి లీగల్ నోటీసులు పంపడం సంచలనంగా మారింది. ఈ వార్త అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ అంశంపై ఎస్పీబీ చాలా కలత చెందిన సంగతి అందరికీ తెలిసిందే. అదే విషయాన్ని తన ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. కొత్తతరం గాయకులు రావడంతో కొంతకాలంగా ప్లేబ్యాక్ సింగింగ్కు దూరంగా ఉన్న ఎస్పీబీ దేశ విదేశాల్లో షోలు నిర్వహిస్తుండేవారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు నిర్వహించేవారు. అయితే ఇళయరాజా తన పాటలు పాడొద్దని నోటీసులు పంపించడంతో ఎస్పీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎస్పీబీ మాత్రం చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించారు.ఇళయరాజా తన అమెరికా పర్యటనకు ముందు మాట్లాడటం కానీ, మెయిల్ పంపించడం కానీ చేసి ఉంటే తాను కచ్చితంగా ఆయనతో మాట్లాడి ఉండేవాడినని తన మనసులో మాట బయటపెట్టారు. తనకు లీగల్ నోటీసు వచ్చినపుడు, ఎంతగా ఇష్టం లేకపోయినప్పటికీ, తాను కూడా చట్టబద్ధంగానే స్పందించవలసి ఉంటుందని తెలిపారు. తనకు కూడా ఆత్మ గౌరవం ఉందని పేర్కొన్నారు. నిష్ఫలమైన చర్చను ఇంతటితో ముగించి, ముందుకెళదామంటూ ముగింపు పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa