ప్రపంచ వ్యాప్తంగా అత్యదిక వసూళ్లను అందుకున్న చిత్రాల్లో అవతార్ సినిమా ఒకటి. విజువల్ వండర్ అనే దానికి అసలైన అర్దాన్ని చూపించి, సినిమా కోసం కూడా సరికొత్త టెక్నాలజీని క్రియేట్ చేసిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఇక చాలా రోజుల తరువాత ఆ సినిమా సీక్వెల్స్ పై ఒక క్లారిటీ ఇచ్చారు. కరోనా వైరస్ భయపెడుతున్న సమయంలో అసలు సినిమాను ఎలా పూర్తి చేస్తున్నారు అనే దానిపైన చాలా రోజులుగా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఫైనల్ గా అన్ని విషయాలపై ఆయన వివరణ ఇచ్చారు. 2009లో వరల్డ్ వైడ్ గా విడుదలైన అవతార్ సినిమా దాదాపు అన్ని భాషల్లో అనువాదమైంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వారికు ప్రతి ఇండస్ట్రీలో ఆ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
మొదట టైటానిక్ సినిమాతో అత్యదిక వసూళ్లను అందుకున్న జేమ్స్ కామెరూన్ ఆ తారువత మళ్ళీ తన రికార్డును అవతార్ తో బ్రేక్ చేశాడు. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ విడుదలకు ముందు వరకు అవతార్ కలెక్షన్స్ లో (2.79 బిలియన్ డాలర్లతో) మొదటి స్థానంలో కొనసాగింది. ఇక ఫైనల్ గా అవతార్ 2ను 2022 డిసెంబర్ కి షిఫ్ట్ చేసినట్లు జేమ్స్ కెమెరూన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం అభిమానులకు కొంత వరకు నిరాశకు గురి చేసింది. ఒక విధంగా సినిమా వస్తుందేమో అనే కన్ఫ్యూజన్ కి పైనల్ క్లారిటీ రావడమే మంచిదైంది. ఇక అవతార్ 2 షూటింగ్ ని కూడా ఇటీవల పూర్తి చేసినట్లు దర్శకుడు వివరణ ఇచ్చారు. అదే విధంగా అవతార్ 3 షూటింగ్ కూడా దాదాపు 95శాతం పూర్తయినట్లు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa