సీనియర్ సినీ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆమని అస్వస్థతకు గురవడంతో వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసి డిశ్చార్జ్ చేశారు. సంపూర్ణేష్ బాబు చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆమని నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల పట్టణంలో జరుగుతోంది.
మంచిర్యాల జిల్లాకు చెందిన గేయ రచయిత తైదల బాపు నిర్మాతగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తుండగా.. ఆమని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఆమనిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈచిత్ర షూటింగ్ మంచిర్యాల జిల్లాలో జరుగుతోంది. అయితే.. షూటింగ్లో ఆమె అస్వస్థతకు గురికాగా.. వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. స్వలంగా ఛాతినొప్పి వచ్చిందని.. భయపడాల్సిన పని లేదన్నారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. అనంతరం షూటింగ్ స్పాట్కు వెళ్లి షూటింగ్లో పాల్గొన్నారు.
మరోవైపు ఆమె మెయిన్ లీడ్లో నటిస్తున్న 'అమ్మదీవెన' నేడు విడుదల కానుంది. 'జంబలకిడి పంబ' చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమని.. 'మిస్టర్ పెళ్లాం', 'శుభలగ్నం', 'సిసింద్రి', 'ఘరానాబుల్లోడు', 'ఆనలుగురు' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa