ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి మరణం తర్వాత సినిమా విడుదలైన సౌత్ యాక్టర్స్ లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 02:06 PM

జేమ్స్(పునీత్ రాజ్‌కుమార్):-కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్ నెలలో మరణించారు.అయన నటించిన చివరి సినిమా 'జేమ్స్' 17 మార్చి 2022న విడుదలైంది.చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పునీత్ సరసన  ప్రియా ఆనంద్ జోడిగా నటించింది.
జీరో(శ్రీదేవి):-ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన 'జీరో' సినిమా 2018లో విడుదలైంది.ఈ చిత్రంలో అనుష్క శర్మ,కత్రినా కైఫ్ అండ్ షారుక్ ఖాన్ నటించారు.శ్రీదేవి 24 ఫిబ్రవరి 2018న మరణించారు.ఆమె చనిపోయిన తర్వాత ఈ సినిమా విడుదలైంది.
ఆమె ఎవరు(ఆర్తి అగర్వాల్):-ఆర్తీ అగర్వాల్,చలపతి రావు అండ్ ధనరాజ్ నటించిన 'ఆమె ఎవరు' సినిమా 2016లో విడుదలైంది.ఆమె 6 జూన్ 2015న మరణించింది.
మనం(ANR):-ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాని విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసారు.22 జనవరి 2014న 90 ఏళ్ల వయసులో లెజెండరీ యాక్టర్ ANR మరణించిన తర్వాత ఈ చిత్రం విడుదలైంది.
ఆప్తరక్షక (విష్ణువర్ధన్):-కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్ నటించిన 'ఆపత్రరక్షక' చిత్రం 2010లో విడుదలైంది.30 డిసెంబర్ 2009న విష్ణు వర్ధన్ మైసూర్‌లో గుండెపోటుతో మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa