టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మూవీకి టెంపరరీగా 'మెగా 154' అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు.మైత్రీ మేకర్స్ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మించనుంది.మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది అని మేకర్స్ వెల్లడించారు.తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.యాక్షన్ ఎపిసోడ్తో కొత్త షెడ్యూల్ షూటింగ్ను ఈ మూవీ టీమ్ ప్రారంభించింది.ఈ యాక్షన్ బ్లాక్ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ వ్యవహరిస్తున్నారు.హైదరాబాద్లో జరుగుతున్న ఈ షెడ్యూల్లో శృతి హాసన్ కూడా జాయిన్ అయినట్టు సమాచారం.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa