ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ చేసే ఆ సినిమాలో...ముగ్గురు కథనాయికలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 02:06 PM

ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తీయబోయే సినిమాలో ఏకంగా ముగ్గురు కథానాయికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి ఒక సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారనే టాక్ వచ్చింది. ఒక వైపున ప్రభాస్ చేస్తున్న 'సలార్' .. మరో వైపున 'ప్రాజెక్టు K' సెట్స్ పై ఉన్నాయి. ఇంకో వైపున 'స్పిరిట్' సినిమాను ప్రభాస్ ఒప్పుకుని ఉన్నాడు. అందువలన ప్రభాస్ ఇప్పట్లో మారుతి సినిమాను చేయకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది మారుతి మార్కు కామెడీ టచ్ తో కూడిన మాస్ యాక్షన్ మూవీ అని అంటున్నారు. ఓ మీడియం బడ్జెట్ సినిమాను .. త్వరగా పూర్తయ్యే సినిమాను చేయాలనే ఉద్దేశంతోనే ప్రభాస్ ఈ సినిమాను ఒప్పుకున్నాడని అంటున్నారు. 'బాహుబలి' సినిమా చేసినప్పటి నుంచి ప్రభాస్ నుంచి ఒక్కో సినిమా రావడానికి ఏళ్లకు ఏళ్ల సమయం పట్టేస్తోంది. ఆయన వందల కోట్ల బడ్జెట్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడనీ, తెలుగు నేటివిటీకి దూరంగా వెళుతున్నాడనే టాక్ ఉంది. అందువల్లనే ప్రభాస్ మారుతి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa