సుదీర్ఘకాలం పాటు బుల్లితెరపై సుమ కనకాల మేటి వ్యాఖ్యాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడామె తనయుడు రోషన్ టాలీవుడ్ రంగ ప్రవేశం కోసం రంగం సిద్ధం చేస్తుంది. సుమ,రాజీవ్ లు ఎప్పటినుండో రోషన్ ని హీరోగా సినిమాల్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. కొన్నాళ్లక్రితం రోషన్ హీరోగా ఒక మూవీ ప్రారంభమైనా కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం పక్కా ప్లాన్ తో రోషన్ ఎంట్రీ కి రంగం సిద్ధం అయింది. టాలీవుడ్ సంచలనాత్మక దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథ తో, ఉయ్యాలా జంపాలా, మజ్ను వంటి విజయవంత సినిమాల దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రోషన్ హీరోగా నటించనున్నాడట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలవనుందని సమాచారం.
ఎంతోమందికి నటనా నైపుణ్యాలను నేర్పించి ఇండస్ట్రీకి పంపించిన ఘనత గల కుటుంబం, సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్న రాజీవ్ కనకాల, సుమ ల వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న రోషన్ ప్రేక్షకులను ఏమేరకు అలరించగలడో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa