ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనన్యా నాగళ్ళ కోలీవుడ్ ఎంట్రీ...!

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 12:00 PM

2019లో వచ్చిన మల్లేశం సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలంగాణా అమ్మాయి అనన్యా నాగళ్ళ. అయితే 2021లో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో ఒక కీలక పాత్ర ను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో నివేదా థామస్, అంజలి తో పాటు నటించిన అనన్యకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో అప్పటి నుండి వరస ఫోటోషూట్లను చేస్తూ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ హంగామా చేస్తుంది. వకీల్ సాబ్ సినిమా తర్వాత నుండి ఈ అమ్మడికి వరస పెట్టి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న శాకుంతలం లో నటిస్తుంది అనన్య. అయితే ఈ బ్యూటీ కోలీవుడ్ లో డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయిందని చిత్రసీమలో వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో శశి కుమార్ నటిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా అనన్య ను సెలెక్ట్ చేశారట ఆ చిత్రబృందం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి తంగం శరవణన్ దర్శకత్వం చేస్తుండగా, మోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే అనన్య కోలీవుడ్ లో కూడా డెబ్యూ  చేస్తుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa