యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో "వారియర్" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో రామ సరసన కృతి శెట్టి అండ్ అక్షర గౌడ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా కనిపించనున్నారు. జులై 14, 2022న ఈ సినిమాని థియేటర్లలో విడుదల కానుంది. రామ్ తన కెరీర్లో తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన ఈ సినిమాలోని బుల్లెట్ అనే పాటను స్టార్ హీరో శింబు పాడిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు, ఏప్రిల్ 22 సాయంత్రం 5.45 గంటలకు శింబు పాడిన ఈ పాటను విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa