బైక్ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా తన తదుపరి సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాకి తాత్కాలికంగా SDT15 అని పేరు పెట్టారు. ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఆంధ్రాలోని ఓ మారుమూల గ్రామానికి వచ్చే ఇంజనీర్గా ఆ గ్రామంలో జరిగిన అనుమానాస్పద మరణాల వెనుక కథను తెలుసుకోవడానికి వచ్చిన ఇంజనీర్గా కనిపించనున్నారు అని లేటెస్ట్ టాక్. బివిఎస్ఎన్ ప్రసాద్తో కలిసి సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa