ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ పూర్తి చేసుకున్న 'దొంగలున్నారు జాగ్రత' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 02:53 PM

టాలెంటెడ్ అండ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ కోడూరి "మత్తు వదలారా" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో "దొంగలున్నారు జాగ్రత్త" అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ దొంగలున్నారు జాగ్రత షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యినట్లు ప్రకటించారు. తెలుగులో మొట్టమొదటి సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని కూడా ప్రకటించారు. కాల భైరవ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ అండ్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com