ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాయి ధరమ్ తేజ్ తదుపరి సినిమా కథాంశం రివీల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 03:04 PM

బైక్ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా తన తదుపరి సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. కార్తీక్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సాయిధరమ్ తేజ్ ఈ సినిమాలో ఆంధ్రాలోని మారుమూల గ్రామానికి వచ్చే ఇంజనీర్‌గా ఆ గ్రామంలో జరిగిన అనుమానాస్పద మరణాల వెనుక కథను తెలుసుకోవడానికి వచ్చిన ఇంజనీర్‌గా కనిపించనున్నారు అని లేటెస్ట్ టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది. బివిఎస్ఎన్ ప్రసాద్‌తో కలిసి సుకుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com