విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ మరియు నేహా శెట్టి జంటగా నటించిన "డీజే టిల్లు" సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ కామెడీ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలాసార్లు వీక్షించబడుతోంది అని సమాచారం. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రం సైలెంట్ నోట్లో విడుదలైనప్పటికీ మాస్లో రేజ్గా మారింది. రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.