టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". ఈ సినిమాతో MS రాజశేఖర్ రెడ్డి టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. మహాతిస్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా రిలీజైన మాచర్ల ధమ్కీ కి ప్రేక్షకులు విశేష ఆదరణ చూపిస్తున్నారు. ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదలైన ఈ వీడియోకు 2 మిలియన్ వీక్షణలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంతటి ఇంటరెస్ట్ చుపిస్తున్నారో తెలుస్తుంది.
ఇంకా నాల్రోజుల్లో అంటే జూలై 30 వ తేదీన ట్రైలర్ రిలీజ్ కాబోతుంది.