నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ-2' ఇటీవల విడుదలై, హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్లో ప్రసంగించిన హీరోయిన్ అనుపమ భావోద్వేగానికి గురైంది. సినిమా హిట్ అయినా ఎందుకు సంతోషంగా లేవని హీరో నిఖిల్తో సహా చాలా మంది అడుగుతున్నారని తెలిపింది. అయితే ఈ సినిమా కోసం చేసిన జర్నీ ఇక అయిపోయిందని అనిపించగానే బాధ అనిపిస్తుందని పేర్కొంది. నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి డైరెక్షన్లో ఇండియాస్ మిస్టికల్ ఎడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం "కార్తికేయ 2". శనివారం విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.